రాష్ట్రానికొక ఫామ్ హౌస్ కట్టుకునేందుకే.. కేసీఆర్ జాతీయ పార్టీ

ఎద్దేవా చేసిన కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రధాని అయినట్టు.. కేటీఆర్ సీఎం అయినట్టు.. పగటి పూట కలలు కంటున్నారు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ పెట్టడం తేలికే అయినా.. దానిని నడిపించడం.. కేసీఆర్ వల్ల కాదన్నారు. రాష్ట్రానికొక ఫామ్ హౌస్ కట్టుకునేందుకే.. జాతీయ పార్టీ పెడుతున్నారని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ను దేశంలో ఎవరూ నమ్మడం లేదని కిషన్రెడ్డి అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడిస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని కేసీఆర్పై మండిపడ్డారు.కేసీఆర్  కొత్త పార్టీ పెట్టినట్లు అప్పుడే ప్రధాని అయినట్లు.. కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని ఎద్దేవా చేశారు. దేశంలో కేసీఆర్ తో ఏ పార్టీ కలిసి రావడం లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ తో ఏకీభవించలేదని ఆయన్ని కలిసిన నాయకులు చెబుతున్నారన్నారు. కేసీఆర్  ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారని అన్నారు. లక్ష్యం లేదు.. విధానం లేదు.. పార్టీ పెట్టేస్తున్నానని అనుకుంటున్నారు. ఇల్లు అలకుతున్నడు.. పండగ రావెల కదా!” అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ అని ఆరోపించారు. ప్రగతిభవన్కు అసదుద్దీన్ ఓవైసీ  బుల్లెట్ బండిపై నేరుగా వెళ్తారన్నారు. టీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని అన్నారు.ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ అని  వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.