సమగ్ర వ్యవసాయ పద్దతులపై రైతులకు నేడు అవగాహన
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నేడు మంగళవారం నసురుల్లాబాద్ మండల కేంద్రం లోని రైతు వేదికలో న జరిగే రైతు నేస్తం కార్యక్రమం లో భాగంగా రైతులకు సమగ్ర వ్యవసాయ పద్దతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఏం గోవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయశాఖ అధికారి నరేంద్ర సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.