విశాఖ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ధర్మకర్తల  మండలి చైర్మన్ గా మారోజు శ్రీనివాస్

- అభినందించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విశాఖపట్నం కొత్త రోడ్డు జంక్షన్ లో ఉన్నటువంటి శ్రీ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు కొలువుదీరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పెద్ద ఎత్తున వైయస్సార్ సిపి నాయకులు  అభిమానులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్  హాజరై ఈ అవకాశాన్ని విశాఖ నగర బులియన్ మర్చంట్ అధ్యక్షుడు విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన మారోజు శ్రీనివాసరావు కల్పించినందుకు శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ వేణుమాధవ్ అభినందనలు తెలిపారు అలాగే మిగతా ధర్మకర్తల మండలి సభ్యులకు కూడా నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి మరియు దైవ కార్యక్రమాలలో మీ కమిటీ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.