నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమే!

  జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇమడలేరు :మాజీ మంత్రి దగ్గుబాటి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమే.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కారంచేడులో గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ‘‘బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారు. కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడిని కాదు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవడం మంచిదైంది. ఓడిపోయిన రెండు నెలలకి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నన్ను పిలిచి నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారు. జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇమడలేమని నిర్ణయించుకున్నాము’’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.