జామున మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు జమున మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, వివిధ భాషలలో వందలాది సినిమాలలో నటించడమే కాకుండా అగ్ర నటుల పక్కన నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జమున అని రేవంత్ రెడ్డి కొనియాడారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.