సర్వాయి పాపన్న కోటను సందర్శించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సర్వాయి పాపన్న కోటను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సందర్శించారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజలు పోరాటం చేయాలని, సర్వాయి పాపన్న కాలంలో.ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి అన్నారు. పాలకులపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ప్రజల కష్టాలను పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సర్వాయి పాపన్న గ్రామాలను ఖిలాశపూర్ సర్వాయి పాపన్న కోట లను పర్యటక ప్రాంతాలుగా చేసి అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.