ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించటం దుర్మార్గం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రామ సర్పంచుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. సర్పంచ్‌ల అనుమతి లేకుండా 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించటం దుర్మార్గమన్నారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి చెప్పిన అధికార వికేంద్రీకరణ అని ప్రశ్నించారు. జగన్ దృష్టిలో సర్పంచులంటే కేవలం ఉత్సవ విగ్రహాలా? అని ప్రశ్నించారు. నిధులు, విధులు లేకుండా గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేయడాన్ని ఖండిస్తున్నామని రామకృష్ణ పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దంగా గ్రామ పంచాయతీలకు దక్కాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే జమ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.