మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ సత్తా చాటాలి

.. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మతోన్మాదశక్తుల పట్ల మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర యువజన నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు, ఈ ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు, మతోన్మాద బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలన నమ్మొద్దని తెలిపారు, చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామాల్లో టిఆర్ఎస్ ( బీఆర్ఎస్ ) సీపీఎం, సిపిఐ నాయకులతో కలిసి సోమవారం రోజున ఇంటింటా ప్రచారంలో భాగంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు, ఈ సందర్భంగాపోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి పలువురు నాయకులు టిఆర్ఎస్ లో చేరారు, వారితోపాటు చౌటుప్పల్ మండలంచిన్న కోడూరు గ్రామంలో సుమారుగా 100 మందికి పైగా గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెర్క శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల్ ఎంపీపీ విఠల్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వెంకటరమణ, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కంది మల్లేష్, ప్రతాప్ సింగ్, స్థానిక టిఆర్ఎస్ నాయకులు,సీపీఎం,సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.