టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి సీజ‌న్ కాసుల వ‌ర్షం.. రూ. 165.46 కోట్ల ఆదాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి సీజ‌న్ కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ పండుగ సీజ‌న్‌లో టీఎస్ ఆర్టీసీకి రూ. 165.46 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. గ‌త ఏడాది క‌న్నా రూ. 62.29 కోట్ల ఆదాయం అద‌నంగా వ‌చ్చింది. 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణించిన‌ట్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు.అయితే కేవ‌లం జ‌న‌వ‌రి 11 నుంచి 14 తేదీల్లో అంటే నాలుగు రోజుల్లోనే 1.21 కోట్ల మంది ప్ర‌యాణికులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించారు. గ‌తేడాదితో పోల్చితే ఆ నాలుగు రోజుల్లోనే 5 ల‌క్ష‌ల మంది అధికంగా ప్ర‌యాణించారు. ఇదంతా పోలీసులు, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ అధికారులు, టీఎస్ ఆర్టీసీ సిబ్బంది వ‌ల్లే సాధ్య‌మైంద‌ని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.