ఎన్టీఆర్ భవన్కు జేసీ దివాకర్రెడ్డి సన్మానించిన టీటీడీపీ నేతలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపూర్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ నాయకులు పలువురు ఆయన్ని కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై కాసేపు జేసీతో చర్చించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్రెడ్డిని టీటీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏ ఎస్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి మండూరి సాంభశివరావు, రాజకీయ విశ్లేషకులు చల్లా శ్రీనివాస్ రావు, పలువురు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.