రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్ట‌డంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఇవాళ‌ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయిచూర్ వైపు నుండి హైదరాబాదు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు హైదరాబాదు వైపు నుండి మక్తల్ వైపు వస్తున్న స్కూటీపై ఇద్దరు యువకులు వస్తుండగా స్కూటీ, బస్సు ఢీకొన్న సంఘటనలో డ్రైవింగ్ చేస్తున్న ఉదయ్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాల పాలైన అఖిల్ ను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

మృతులు హైదరాబాద్ కు చెందిన వారుగా భావిస్తున్నారు. వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.