గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరి మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరివంచ గ్రామానికి చెందిన చిలుముల సురేశ్‌(32), సిరివంచ తాలుకాలోని రంగధాంపల్లికి చెందిన కోనం రామేశ్వర్‌(18) కలిసి శనివారం అమావాస్య రోజున కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్‌ వద్ద ఉన్న గోదావరి నదిలో రాత్రి పుట స్నానాలకు వచ్చి గల్లంతయ్యారు.సోమవారం అటుగా వెళ్లిన భక్తులు, గ్రామస్తులకు మృతదేహాలు కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్‌రావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి, మృతుల వద్ద ఉన్న అధార్‌ కార్డుల ఆధారంగా వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. అనంతరం గంగపుత్రుల సాయంతో మృతదేహాలను బయటకు తీసి మహదేవపూర్‌ దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచరణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.