కారులో నుండి దూకి ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం తప్పింది.ఇవాళ ఉదయం ఫిల్మ్ నగర్‌లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే కిందకు దూకేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్వల్ప గాయాలపాలైన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలు, యువకుల వివరాలు తెలియాల్సి ఉంది.రన్నింగ్ కారులో చెలరేగిన మంటలుకారులో మంటలు ఎందుకు వస్తాయి ?కారు నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆటోమెుబైల్‌ నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో కారు మేయింటెనెన్స్‌ లేకపోవడం, సర్వీసింగ్‌ చేయకుండానే వేల కిలోమీటర్లు నడపడం కూడా ప్రమాదానికి కారణాలుగా చెబుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కారులో పెట్టించే సౌండ్‌ సిస్టమ్‌ అమరిక సరిగాలేకపోవడం వల్ల కూడా కారులో మంటలు వస్తాయన్నారు. వాటికి ఎక్స్‌ట్రా పవర్‌ కోసం బ్యాటరీకి డైరెక్ట్‌గా కనెక్ట్‌ చేయడం వల్ల బ్యాటరీపై లోడ్‌ పడి నిప్పురవ్వలు వచ్చి మంటలు చేలరేగుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.కారులో హెడ్‌ల్యాంప్స్‌ కారుకొన్నప్పుడు వచ్చినవి కాకుండా అదనంగా పవర్‌ ఫుల్‌ లైడ్స్ బిగించటం, వాటి వల్ల వచ్చే వేడి, ఇంజిన్‌ వేడి కలిసి మంటలు చేలరేగుతాయన్నారు. నాణ్యత లేని వైరింగ్ కారణంగా కూడా మంటలు వస్తాయన్నారు. కూలెంట్‌కు సంబంధించి కూడా తగి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కూలెంట్‌ లెవల్‌ సరిగ్గాలేనపుడు కూడా కారు ఇంజిన్‌ ఉన్నట్లుండి వేడెక్కి కారులో మంటలు చెలరేగే అవకాశం ఉందని చెప్పారు. అరిగిపోయిన టైర్లతో లాంగ్ జర్నీ చేసినప్పుడు టైర్లకు రోడ్డుకు మధ్య స్కార్క్స్‌ ఏర్పడి మంటలు వ్యాపించడానికి అవకాశం ఉందన్నారు. కారు నిర్వహణ సరిగ్గా ఉంటే అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.