తెలంగాణలో త్వరలో ఉద్ధవ్ ఠాక్రే పర్యటన

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జాతీయ శివసేన అధ్యక్షులు ఉద్దవ్  ఠాక్రే జన్మదిన పురస్కరించుకొని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ముంబై బాంద్రా మాతృశ్రీ లోకలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా త్వరలో తెలంగాణలో పర్యటించ నున్నట్లు   ఉద్దవ్  ఠాక్రే హామీ ఇచ్చినట్లు సుదర్శన్ తెలిపారు. త్వరలో తెలంగాణ లో జరుగనున్న  అసెంబ్లీ ఎలక్షన్స్ లో శివసేన ఉద్దవ్ సేన అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని సుదర్శన్ తెలిపారు.ఈ కార్యక్రమం లో సునీల్ మనోజ్ ప్రతాప్ గోవింద్ సురేష్ రామ్మోహన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.