ఉండవల్లి ఓ ఊసరవెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ కేసు సీబీఐ కి ఇవ్వాలని అడగడం ఏంటి అని అన్నారు. కేసులో ఒక్క ఆధారం అయినా ఉందా అని ప్రశ్నించారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు దీనికి ఉండవల్లి వత్తాసా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బ్రాందీ సీసాలు చూపించి ఇప్పుడు జగన్ పాలనలో ఎందుకు కళ్లు మూసుకున్నావని ప్రశ్నించారు. జగన్ పాలనలో తిరుపతి కొండపైకి ఎన్నో అక్రమాలు జరిగాయని.. అయినా ఉండవల్లి ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. దేవుడి కి అన్యాయం జరిగినా ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పక్కనే గోదావరిలో ఇసుక మాయం అయిపోతున్నా ఎందుకు మాట్లాడలేదని అన్నారు. అందులో వాటా ఉందా అని ప్రశ్నించారు. రామోజీపై ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయకపోయినా జగన్ ఇబ్బంది పెడుతున్నారని… అయినా ఉండవల్లి ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్‌లో ఉండవల్లి పని చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

 

రాజమహేంద్రవరం సెప్టెంబర్ 27 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);: ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ కేసు సీబీఐ కి ఇవ్వాలని అడగడం ఏంటి అని అన్నారు. కేసులో ఒక్క ఆధారం అయినా ఉందా అని ప్రశ్నించారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు దీనికి ఉండవల్లి వత్తాసా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బ్రాందీ సీసాలు చూపించి ఇప్పుడు జగన్ పాలనలో ఎందుకు కళ్లు మూసుకున్నావని ప్రశ్నించారు. జగన్ పాలనలో తిరుపతి కొండపైకి ఎన్నో అక్రమాలు జరిగాయని.. అయినా ఉండవల్లి ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. దేవుడి కి అన్యాయం జరిగినా ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పక్కనే గోదావరిలో ఇసుక మాయం అయిపోతున్నా ఎందుకు మాట్లాడలేదని అన్నారు. అందులో వాటా ఉందా అని ప్రశ్నించారు. రామోజీపై ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయకపోయినా జగన్ ఇబ్బంది పెడుతున్నారని… అయినా ఉండవల్లి ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్‌లో ఉండవల్లి పని చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.