కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌.. ఎయిమ్స్ లో  అడ్మిట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. మంత్రి సీతారామ‌న్ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. 63 ఏళ్ల సీతారామ‌న్‌ను హాస్పిట‌ల్‌లోని ప్రైవేటు వార్డులో అడ్మిట్ చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆమెను హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. మంత్రి నిర్మ‌ల‌కు సంబంధించిన చికిత్స‌పై మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.మంత్రి సీతారామ‌న్‌కు ఉద‌ర సంబంధిత ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోసం హాస్పిట‌ల్ వెళ్లిన‌ట్లు తొలుత వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని, బెస్ట్ మెడిక‌ల్ కేర్ ఇస్తున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.