బీసీ బిల్లు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి అథవాలె
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధనకు కొనసాగుతున్న ఉద్య మానికి మద్దతు ఇస్తామని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. హైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా ఆయన విద్యానగర్ లోని కేంద్ర బిసి భవన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో భేటీ అయ్యారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గతంలో తాను చేపట్టిన ఉద్యమాలు, వాటి ఫలితాలు గురించి చర్చించామన్నారు. ఉద్యమాల ద్వారా రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు చేయించిన ఘనత ఆర్. కృష్ణయ్యదే నని కొనియాడారు.