రాహుల్ గాంధీ తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్న ఉత్తమ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారత్ జోడో యాత్రకు సమన్వయకర్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు AP లోని కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ జోడోయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో రాహుల్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోడోయాత్రలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీతో కలిసి నడవడం తన అదృష్టమని, తనకు ఏంటో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన 1000 కి.మీ పాద యాత్రకు అద్భుతమైన ప్రజా స్పందన వచ్చిందాని ఉత్తమ్ వెల్లడించారు. భారత్ జోడో యాత్ర ఈనెల 29న మహబూబ్ నగర్ లోకి  ప్రవేశింస్తున్న సందర్బంగా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ని కలిసి జోడో యాత్రలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందజేయడం జరిగిందని, భారత్ జోడయాత్రకు వైస్ ఛాన్సలర్ తన సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.