తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న ‘వందేభారత్‌’

- 15వ తేదీ ఉదయం 10: 30 గంటలకు  వర్చువల్‌గా ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం - ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో రైలు - కేవలం ఎనిమిది గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌కు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల మధ్య ‘వందేభారత్‌’ పరుగులు పెట్టనుంది. ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ఈ నెల 15వ తేదీ (ఆదివారం) ఉదయం 10: 30 నిమిషాలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి రైలు బయలుదేరి.. రాత్రి 8:45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ రైలు 16వ తేదీ అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు సేవలందిస్తుంది.

విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు (రైలు నంబర్‌ 20833) ప్రతి రోజూ ఉదయం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అంటే కేవలం ఎనిమిది గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌ చేరుకోవచ్చన్నమాట. ఇక, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో (రైలు నంబర్‌ 20834) మధ్యాహ్నం 3గంటకు ప్రారంభమై.. రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

వందే భారత్‌ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్‌ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కార్‌ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయొచ్చు.

ఈ స్టేషన్లలో తొలి రోజు మాత్రమే ఆగనున్న వందేభారత్‌..

మధ్యలో ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపట్టిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. ప్రారంభించిన తొలి రోజు మాత్రమే ఈ స్టేషన్లలో ఆగుతుంది.

ఛార్జీల వివరాలు..

 ఏసీ చైర్‌ కార్‌ ఛార్జీ

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు – రూ. 1,720

విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 625

విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 960

విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 1,115

విశాఖపట్నం నుంచి వరంగల్‌ – రూ. 1,310

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 1,665

సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి – రూ. 1,365

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 905

సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు – రూ. 750

సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ – రూ. 520

ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ ఛార్జీ

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు – రూ. 3,170

విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 1,215

విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 1,825

విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 2,130

విశాఖపట్నం నుంచి వరంగల్‌ – రూ. 2,540

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 3,120

సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి – రూ. 2,485

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 1,775

సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు – రూ. 1,460

సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ – రూ. 1,005

Leave A Reply

Your email address will not be published.