ఇబిసి ఐక్య వేదిక గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా వాణి రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బిసి సంక్షేమ సంఘం అనుబంద సంస్థ ఆయిన  ఇబిసి ఐఖ్యవేదిక గ్రేటర్ హైదరాబాద్ ఇబిసి మహిళా అధ్యక్షురాలిగా కే.వాణి రెడ్డి నియమితులైనారు. ఈ మేరకు బిసి భవన్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య చేతులమీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసి ల హక్కుల కోసం మహిళలు కుడా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.నేడు ఈబిఎస్ పేరుతో బిసిల హక్కులను హరించుకొని పోయే ప్రమాదం ఉందని బిసి ల హక్కుల పరిరక్షణకు అసంఘటితంగా అందరు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో బిసి ఐఖ్యవేదిక రాష్ట్ర అద్యక్షులు జి.అనంతయ్య ,రాజేందర్, గుజ్జ కృష్ణ ,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.