సాల్వేరు కృష్ణ కు వంజరి సమాజ్ భూషణ్ పురస్కార్ ప్రధానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అఖిలభారత వంజరి సేవా సంఘం జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సాల్వేర్ కృష్ణ వంజరి కు  నాసిక్ లో జరిగిన జాతీయ వంజరి సాహితీ సమ్మేళనం లో  వంజరి సమాజ్ భూషణ్ పురస్కారంతో సన్మానించారు.అఖిలభారత వంజరి సేవా సంఘం కార్యక్రమాలను  తెలంగాణలో విస్తరించి వంజరుల ఐక్యతకు కృషి చేస్తున్న సాల్వేర్ కృష్ణనువంజరి సమాజ్ భూషణ్ పురస్కారం ప్రదానం చేశారు.తెలంగాణలో వంజరుల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆయనను సన్మానించడం తమకెంతో ఆనందం కలిగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వంజరి సమాజ సేవలో ఆయన సేవలు మరింత విస్తరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భగవాన్ బాబా ట్రస్ట్ మెంబర్ డాక్టర్ గిత్తె సాహెబ్ అఖిలభారత వంజరి సేవా సంఘం జాతీయ అధ్యక్షులు భవన్ రావు రామచంద్ర కాడే   కేకే సనాప్  ప్రవీణ్  అందాలేలతా గూటే ,అలకానంద గూగె  ,డాక్టర్ సారంగ ధరాదేసింధుదహిపతే తెలంగాణ ప్రతినిధులు కాలేరు సురేష్ రూపా జ్యోతి ఎదుగని లక్ష్మణ్తదితరులు పాల్గొన్నారు.కాగా తెలంగాణలో వంజరుల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్న సాల్వేర్ కృష్ణకు వంజరి సమాజ్ భూషణ్ పురస్కారం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ వంజరి సేవా సంఘం అధ్యక్షుడు ఎదుగని శంకర్ నారాయణ ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు ఉపాధ్యక్షుడు పిట్టల అంజయ్య సోషల్ మీడియా కన్వీనర్ కాలేరు వెంకటరమణ ఎల్బీనగర్ వంజర సంఘం అధ్యక్షుడు నవాతే రాజేందర్ అంబర్పేట వంజరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు లవంగ ఆంజనేయులు వంజరి నాగరాజు  వంజరి సేవా సంఘం ప్రతినిధులు వారే రామకృష్ణ కరిపే రాజ్ కమల్ పాపనక శ్రీనివాస్ ప్రకాష్ కాలేవార్ మాయ శ్రీధర్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.