వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా సాయి చౌదరి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం స్థానిక సద్గురు సాయిరాం హాస్పిటల్ ప్రాంగణమునందుగల ప్రదేశములో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా సాయి చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా డాక్టర్ సత్యనారాయణ గౌడ్, కోశాధికారిగా డాక్టర్ గంటా దాలినాయుడు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా రఘు మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బసవేశ్వర్, నరసింహ రెడ్డి, వేణుగోపాల్, డాక్టర్ సాయి ప్రత్యూష గౌడ్, అంబాదాసులను నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయినది. ఈ సందర్భముగా జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలలో ముందుందని, వరదలు వచ్చినప్పుడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సేవలు అద్భుతం అని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ నాకు సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీరిచ్చిన ప్రోత్సాహముతో సేవా కార్యక్రమాలలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సాయి చౌదరి తెలిపారు.ఈ కార్యక్రమమునకు జిల్లా సహకార అధికారి శంకర చారి, జిల్లా సహకార సొసైటీ సీనియర్ ఇన్స్పెక్టర్ హజ్మత్ పాషా తదితరులు పాల్గొన్నారు.