సమర్థతని చాటిన విశాఖ పోలీసులు
- ఎంపీ ఎం వీ వీ సత్యనారాయణ నీ పరామర్శించిన కర్రి వేణుమాధవ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులను వారి కుమారుడు సతీమణి శ్రీమతి జ్యోతి శరత్ ఇది మిత్రుడు ప్రముఖ ఆడిటర్ జీవి ని కిడ్నాప్ చేయడం విశాఖ ప్రముఖులను కిడ్నాప్ చేయడం ఉత్తరాంధ్ర సంస్కృతిలో జరిగిన చెడు దుర్ఘటనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికారి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్అన్నారు.ఇటువంటి ఆలోచన విధానాన్ని ఆదిలోనే తుంచే విధంగా గంటల వ్యవధిలో చేదించి ఎటువంటి క్రైమ్ జరగకుండా క్రైమ్ మనస్తత్వం ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ విశాఖ పోలీసుల సమర్థతని చాటారని ఆయన కొనియాడారు. ఈ సందర్బంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గారిని ఫోన్లో పరామర్శించారు ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి ఆలోచన ఉన్నవారు కూడా పోలీస్ సమర్థతను చూసి భయపడే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.