తిరుమల రైస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  బాన్సువాడ పట్టణ కేంద్రంలో గురువారం తిరుమల రైస్ ఇండస్ట్రీస్ యజమాని నాగులగామ వెంకన్న గుప్తా తన తండ్రి కీర్తిశేషులు నాగుల గామ గిర్మయ్య గుప్తా జ్ఞాపకార్ధం అంబలి కేంద్రం చలివేంద్రంను తాడుకోల్ రోడ్డు లో ఏర్పాటు చేశారు. ఈ అంబలి కేంద్రం ను బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల కాలంగా తిరుమల రైస్ ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి వేసవికాలం బాన్సువాడకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు అంబాలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని వారి సేవలు అమోఘం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, మునిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,నిఖిల్ గుప్త, చిధుర వినయ్,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.