తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఏస్ పీఏస్సీ పేపర్ లీక్ లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, పేపర్ లీక్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్ శాఖ ఉధ్యోగులదే పేపర్ లీక్ లో కీలకపాత్ర ఉందని, మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామన్నారు. వ్యాపం కుంభకోణం లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఉన్న టీఏస్ పీఏస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉంది. అందరినీ సస్పెండ్ చేసి..పారదర్శక విచారణ చేస్తారని భావించాం..కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్ కు ఉందని తెలిపారు.