సీఎస్ సోమేశ్ కుమార్‌పై తాము మొదటి నుండి ఫిర్యాదు చేస్తున్నాం

- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సీఎస్ సోమేశ్ కుమార్‌పై తాము మొదటి నుండి ఫిర్యాదు చేస్తున్నామని, ఇక్కడ ఉన్న వాళ్ళను కాదని ఏపీక్యాడర్ అధికారిని సీఎస్ చేయడం ఏంటీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొందరు అధికారులు కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని చెప్పారు. కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేసిన వారికే పోస్టింగ్‌లని, టాప్ 15 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా బీహారీ వాళ్లేనన్నారు. ఇప్పటికైనా ఇక్కడి వారికీ అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. రేపు , ఎల్లుండి ఇంచార్జి మానిక్ రావు థాక్రే హైదరాబాద్‌లో ఉంటారని తెలిపారు. వరుసగా రెండు రోజులపాటు నేతలతో సమావేశాలు ఉంటాయన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలతో, వివిధ కమిటీ లతో మాట్లాడుతారని పేర్కొన్నారు. అనుబంధ సంఘాల నేతలతో కూడా మీటింగ్ ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.