కేంద్ర బడ్జెట్ లో ఏపీ కీ జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర బడ్జెట్ లో ఏపీ కీ జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రత్యేక హోదా సహా విభజన సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడం భాధాకరం అంటూ ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ పేర్కొంది. ఏపీకీ ఇంత తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా ఇక్కడి నేతలు స్పందించకపోవడం దారుణం, మోడీకీ మోకరిల్లి జగన్ , చంద్రబాబు విభజన సమస్యలపై నిలదీయలేకపోతున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మోడీనీ నిలదీసి పోరాడుతున్నారు, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం బీజేపీనీ నిలదీస్తూ డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నారన్నారు. ఏపీకీ కేసీఆర్ గారి నాయకత్వం ఎంతో అవసరం ఉందని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఏపీకీ న్యాయం జరుగుతుందని ఏపీ స్టూడెంట్, యూత్ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు.