కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మోడీ సంపర్క్ అభియాన్ పై విస్తృత ప్రచారంతోపాటు ప్రతి భూతును ప్రతిష్ట చేయాలని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాష పిలుపు నిచ్చారు.సోమవారం రాష్ట్ర బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మోడీ మిత్ర మహా సంపర్క్ అభియాన్ పై విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా అప్సర్ పాష పార్టీ శ్రీనులకు దిశా నిర్దేశం చేశారు. మైనార్టీ మోర్చా సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని అ సెంబ్లీ సెగ్మెంట్లలో మైనార్టీ మోర్చా ను బలోపేతం చేయాలని పిలుపు నిచ్చారు. బూతుల వారిగా మైనార్టీ కార్యకర్తలను గుర్తించి ప్రతి ఒక్క మైనార్టీ కార్యకర్తతో మాట్లాడి మహా సంపర్కు లో భాగంగా వివరాలు సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటి మోర్చా ప్రధాన కార్యదర్శి ముజీబ్ సైఫుల్ల. బల్వీర్ సింగ్. రహమతుల్లా. డాక్టర్ ఐజాక్ రాజ్. సమీ అహమద్. నిక్కత్ ఫాతిమా. అమీనా. రీతుకుస్. ఆలీ. అబ్బాస్. సర్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.