పేద వధువు వివాహానికి వెస్సో ట్రస్ట్ ఆర్ధిక సహాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆర్దికంగా సతంనతమవుచున్న నిరుపేదలకు‘వెస్సో ట్రస్ట్’ చేయూతనందిస్తుంది.ఇందులో బాగంగా హైదరాబాద్ జగద్గిరి గుట్ట నివాసి శ్రీమతి ఉప్పల పద్మ  భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తూ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. భర్త జీవించి ఉన్న కాలంలో ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు జరిగినవి. కుటుంబ పోషణకై మూడవ కూతురు చి. హిరణ్మయి తో కలిసి తల్లి పద్మ  స్థానిక కంపెనీలో సుమారుగా పది వేల రూపాయల నెల జీతానికి పనిచేస్తున్నారు. హిరణ్మయి వివాహం ఆగస్టు 30వ తారీఖున జరిగింది. స్థానిక కుతుబుల్లాపూర్ నాయకుల ద్వారా వెస్సో గురించి తెలుసుకొని హిరణ్మయి వివాహానికి ఆర్థిక సహాయం చేయమని తల్లి పద్మ  వెస్సో ని ఆశ్రయించగా, వెస్సో గౌరవ దాతల సహకారంతో రూ.37,500/- అందచేసింది.ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ కూతురు వివాహం జరుపటానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పద్మ గారికి సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.