ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి కెసిఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్లేవి? రుణమాఫీ ఏది? ఇంటికో ఉద్యోగమేది? నిరుద్యోగ భ్రుతి ఏది? పోడు భూములకు పట్టాలేవి? ఉచిత ఎరువుల పంపిణీ ఏది? దళిత బంధు, గిరిజన బంధు ఏది? గిరిజనులకు 12 శాతం గిరిజన రిజర్వేషన్లేవి? వీటన్నింటిపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తరువాతే దేశం గురించి మాట్లాడాలి’’ అని పేర్కొన్నారు. తెలంగాణను దేశానికి మోడల్ గా చేశామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లను చేయడమేనా తెలంగాణ మోడల్ అంటే… ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా అనేది దేశానికి చాటిచెప్పడమేనా తెలంగాణ మోడల్ అంటే’’ అని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మెట్ పల్లికి విచ్చేసిన బండి సంజయ్ కు భారీ ఎత్తున జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…..

Leave A Reply

Your email address will not be published.