తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశం లో నిరుద్యోగ రేటు 7.8 శాతం గా ఉందని.. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి! అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది?.. మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేస్తిరి కదా?… అంటూ ఆమె ప్రధాని మోదీ ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని అన్నారు. ‘‘ఈరోజు భారతదేశంలో వాస్తవం ఏంటంటే.. నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉంది… యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా? లేదా? యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కృషి ఏమైనా చేస్తున్నారా?’’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.