ఈడి రిపోర్టులో ఏముంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లిక్కర్ స్కాంలో కేవలం 17 ఫోన్లే రికవరీ చేయగలిగామని అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ED పేర్కొంది. స్కాంతో సంబంధం గల 36 మందికి చెందిన 170 ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో MLC కవిత 10 ఫోన్లు ధ్వంసం చేయగా.. అమిత్ 11 ఫోన్లు, మనీష్ సిసోడియా 15, సన్నీ మార్వా 7, విజయ్ నాయర్ 5, అరుణ్ రామచంద్ర పిళ్లై 5, సమీర్ మహింద్రు 4, కైలాష్ గెహ్లాట్ 3, కుల్వీందర్ 3 ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడించింది.