ఓడిపోయే సీటుకు ప్రచారమెందుకు..?

.. మునుగోడుపై ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఓడిపోతుందనితన తమ్ముడు గెలుస్తాడని అన్నారు. ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్‌ రెడ్డి.. అక్కడ తనను కలిసిన అభిమానులతో మాట్లాడారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఓడిపోతుంది. తాను వెళ్లి ప్రచారం చేసినా మరో 10 వేల ఓట్లు పెరుగుతాయే తప్ప.. కాంగ్రెస్‌ గెలవదు. ఫైనాన్షియల్‌గా కాంగ్రెస్‌ వీక్‌గా ఉంది. తాను వెళ్తే పైసలు ఎవరు పెడతారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలుగుతాం.ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకు. నియోజకవర్గంలో పాదయాత్ర చేద్దామనుకున్నా. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు. తాను 25 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నాను. ఐదుసార్లు ఎమ్మెల్యేగాఇప్పుడు ఎంపీగా చేస్తున్నాను. ఇక నాకు రాజకీయాలు చాలు. మునుగోడులో మా తమ్ముడు గెలుస్తాడు’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.