ఈ బడ్జెట్లో మంత్రి నిర్మలమ్మ వారికి తీపి కబురు అందించనుందా..? ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు!
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బడ్జెట్ సమావేశాల సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నాయి. అయితే మోడీ సర్కార్ ఇది చివరి బడ్జెట్. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చివరి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమయం దగ్గర పడుతుండటంతో కోటి ఆశలు నెలకొని ఉన్నాయి. కూలి పనులు చేసుకునేవారి నుంచి సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎంతో మంది బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏ వర్గాల వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.
నిర్మలమ్మ బడ్జెట్పై సామాన్యులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్లపై 2022 డేటా ప్రకారం.. వేతనాలు పొందిన వ్యక్తులు ఐటీఆర్1 ద్వారా 50 శాతం పన్ను రిటర్న్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రిచే కేంద్ర బడ్జెట్ 2023 ప్రకటనకు ముందు జీతభత్యాల ఉద్యోగులు పన్ను మినహాయింపులు, స్లాబ్ రేట్ల పెంపుపై కొన్ని ప్రధాన ప్రకటనలను ఆశిస్తున్నారు.
జీతభత్యాల ఉద్యోగులు ప్రధాన పన్ను మినహాయింపును ఆశించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, జీవన వ్యయం, పెట్టుబడి లేదా బీమా ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ, పన్ను ఆదా 2014 నుండి ఇప్పటికీ అదే విధంగా ఉంది. ఇది కొంత కాలం పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ఒక ప్రధాన అవకాశాన్ని అందించింది. జీతభత్యాల ఉద్యోగుల జీవన సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని సవరణలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని అమలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను విషయంలో ఈ బడ్జెట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించిన కొత్త పన్ను వ్యవస్థలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త పన్ను వ్యవస్థలో ట్యాక్స్ రేట్లను తగ్గిచటం, వాటికి అనుగుణంగా పన్ను స్లాబ్లను మార్చి అమలులోకి తీసుకురావాలని మోడీ సర్కార్ యోచిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాత పద్ధతిలో కేవలం మూడు స్లాబ్లే ఉన్నాయి. అయితే కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్లను తీసుకొచ్చారు.
అయితే ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను విధిస్తున్నారు. దీనిని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర భావిస్తోంది.
ఎంత ఆదాయానికి ఎంత పన్ను విధిస్తున్నారు..?
- రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం
- రూ.7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 15 శాతం
- రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం
- రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం
- రూ.15 లక్షలు ఆపైన ఆదాయం ఆర్జించే వారికి 30 శాతం
పన్ను చెల్లింపుదారులకు మేలు జరుగనుందా..?
ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెంపు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించే అశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్య తరగతికి భారీగా ఊరట కల్పించేందుకు కొత్త పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.