గాడ్సేపై తీయబోతున్న సినిమానిని భారతదేశంలో బ్యాన్ చేస్తారా
- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర కమిషనర్కి.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి కత్తులతో దాడులు చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో బీబీసీ ప్రోగ్రాంని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించారన్నారు.ఇంకా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘గుజరాత్ అల్లర్లలో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా! గాడ్సే గాంధీ హంతకుడు. గాడ్స్పైన మీ అభిప్రాయం ఏంటి? గాడ్సేపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్ చేస్తారా.. లేదా? మీ గురించి బీబీసీ ప్రసారం చేసిన వార్తని బ్యాన్ చేశారు.. ఈ క్రమంలోనే గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారతదేశంలో 30 జనవరికి ముందు బ్యాన్ చేస్తారా లేదా? భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారు. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దళితులు ఏకితాటిపై రావడం రాజకీయ పార్టీలకి నచ్చదు’’ అని ప్రశ్నించారు.