కారు బోల్తా మహిళ మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య రోడ్డుపై చిరుత పులిని గుర్తించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని గాంధారి మండలం యాచారంకు చెందిన మాలోత్ లలిత (30)గా గుర్తించారు.  వివరాల ప్రకారం.. లలిత, ఆమె భర్త మాలోత్ ప్రభాకర్ మంగళవారం మోపాల్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మోపాల్ నుంచి యాచారంలోని తమ ఇంటికి కారులో తిరిగి వస్తున్నారు. వీరి కారు ఎల్లమ్మకుంట-అమ్రాబాద్ మధ్య అటవీ ప్రాంతానికి చేరుకోగానే.. రోడ్డుపై చిరుత పులిని గమనించిన ప్రభాకర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. కారు వేగంగా రావడంతో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొని బోల్తా పడింది.  దీంతో మాలోత్ లలిత అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభాకర్ తలకు గాయమైంది.

Leave A Reply

Your email address will not be published.