శ్మశాన స్థలంపై వైసీపీ పిశాచాలు పడ్డాయి

.. చంద్రబాబు నాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వంముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడుమాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రకాశం జిల్లా లో శ్మశాన స్థలం కబ్జా ఘటనపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. వ్యవస్థలు సమాధి అయితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసీపీ పిశాచాలు పడ్డాయి.సమాధులను తవ్వేసి శ్మశానాన్ని వైసీపీ నేతలు కబ్జా చేస్తుంటే అధికారులంతా ఏం చేస్తున్నారు?కనీసం ఉన్నతాధికారులైనా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా. భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి’’ అని ట్విట్టర్‌లో చంద్రబాబు ట్విట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.