రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదు

-   పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పొత్తులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోను వైసీపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గెలవలేమన్న భయమున్న వారికే పొత్తులు అవసరమని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధే వైసీపీ నినాదమన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల పేరుతో కంపెనీలు బ్లాక్‌మైల్‌కు దిగుతున్నాయన్నారు. వ్యాపారాలు అంటే లాభాలూ ఉంటాయినష్టాలూ ఉంటాయన్నారు. లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా అని మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.కాగా… బీజేపీ- వైసీపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకేంద్ర మంత్రి అమిత్‌ షా వైసీపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బీజేపీ ఆరోపణలపై వైసీపీ నేతలు కూడా అంతేస్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో పొత్తులపై మంత్రి బొత్స చెప్పి విధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.